Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి నాసి ర‌కం జీడిప‌ప్పు స‌ర‌ఫ‌రా... టీటీడీ వేటు వేసేనా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:41 IST)
అలిపిరి టీటీడీ వేర్‍హౌస్ కేంద్రంగా భారీ గోల్‍మాల్ జరిగినట్లు శ్రీవారి భ‌క్తులు ఆరోపిస్తున్నారు. శ్రీవారి ప్రసాదాలకు కాంట్రాక్టర్ నాసి రకం జీడిపప్పును అంట గట్టెందుకు యత్నించినట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ముక్తా కంపెనీ గత కొద్దీ నెలలుగా పాడైపోయిన జీడిపప్పును పంపుతోంది. అయితే జీడిపప్పు నాసిరకంగా ఉందని టీటీడీ అధికారులు 10 లోడ్లను వెనక్కు పంపించారు.
 
టీటీడీ అధికారులు తిప్పి పంపించిన జీడిపప్పునే మళ్లీ ప్యాకింగ్ మార్చి హిందుస్తాన్ ముక్తా కంపెనీ పంపుతోంది. నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి కూడా నాసిరకం జీడిపప్పునే ఆ సంస్థ పంపుతోంది. సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగులు కుమ్మక్కయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాపై టీటీడీ అధికారులు సీరియస్‍గా స్పందించారు. విజిలెన్స్ విభాగంతో విచారణ చేయించారు. విజిలెన్స్ నివేదిక మేరకు కాంట్రాక్టర్‌తో పాటు ఇంటి దొంగలపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments