Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర తుఫానుగా మారిన మాండూస్ - నేడు అతి భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (09:21 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. దీని కారణంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. 
 
గడిచిన 6 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణిస్తుందని, ప్రస్తుతం ఇది జాఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, కారైక్కాల్‌కు 240 కిలోమీటర్లు, చెన్నైకు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని తెలిపారు. 
 
ఇది వచ్చే ఆరు గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి శ్రీహరికోటల మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
 
తీరందాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం కారణంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments