Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్‌లో ట్యూషన్ చెప్తుండగా?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లో

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:41 IST)
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.
 
సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్‌లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments