Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్‌లో ట్యూషన్ చెప్తుండగా?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లో

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:41 IST)
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.
 
సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్‌లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments