Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (10:38 IST)
ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను ఔటర్ రింగ్ కోసం కేటాయించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. హైదరాబాదులో ఇవాళ మానవ వనరుల శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2312 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉంటే... వాటిని తగ్గించేశారన్నారు. 
 
సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పిల్లలు రాకుండా చేశారన్నారు. ఎవరైనా హాస్టల్స్‌కు వచ్చినా, అక్కడ ఉండే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన సొమ్మును ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చు పెట్టారని ఆరోపించారు. 2011 నుంచి బీసీ కమీషన్ ఖాళీగా ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. 
 
చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. పిల్లలను బాల కార్మికులుగా మార్చేందుకు వీల్లేదని, చదువుకునే వయస్సున్న పిల్లలందరి వివరాలను కంప్యూటరైజ్డ్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. పిల్లల్లో చదువు పైన మక్కువ పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments