Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు - 3 నెలల పాటు..

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (20:38 IST)
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైకాపా నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు, వైకాపా నేతలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్లకు నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పట్టాభిపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించి జైలుకు పంపించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోర్టు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే, రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలని షరతులు ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది అలాగే, పట్టాభితో పాటు ఈ కేసులో అరెస్టు అయిన వారిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments