Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌‌ బెయిల్ రద్దయ్యేనా? సుప్రీం కోర్టు నోటీసులు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (13:40 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు భయం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అదేసమయంలో సీబీఐతో పాటు జగన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 
 
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం తెలిపింది. జగన్‌తో పాటు సీబీఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్‌లో రఘురామ కోరారు. దీనని పిటిషన్‌‍కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇపుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా, తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురామరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments