Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లకు భారీగా శ్రీవారి లడ్డూల పంపిణీ ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:46 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలైన ఆకర్షణీయమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో సాగుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఓటర్లను ఆకట్టు కునేందుకు కొందరు నగదు, ఆభరణాలు పంపిణీ చేస్తుండగా మరి కొందరు దేవుడి ప్రసాదం ఆశ చూపి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి  తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. 
 
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డు కట్టవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 
 
లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments