Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అంటున్న స‌జ్జ‌ల‌

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:34 IST)
సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నార‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామ కృష్ణా రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 70శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని, 98కి పైగా స్థానాలను వైసిపి గెలుచుకుంది అని చెప్పారు. భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అని అభివర్ణించారు. 
 
చంద్రబాబు కుట్రలను ప్రజలు ఓట్లతో తిప్పి కొట్టారు అని సజ్జల రామ కృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పరిషత్ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం అని కొనియాడారు. కుప్పంలోనే టిడిపి బోర్లా పడింది అని ఎద్దేవా చేశారు. కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించ లేదని అన్నారు. పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి అని సూచించారు.  ప్రభుత్వంపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని సజ్జ‌ల  మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments