Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అంటున్న స‌జ్జ‌ల‌

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:34 IST)
సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నార‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామ కృష్ణా రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 70శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని, 98కి పైగా స్థానాలను వైసిపి గెలుచుకుంది అని చెప్పారు. భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అని అభివర్ణించారు. 
 
చంద్రబాబు కుట్రలను ప్రజలు ఓట్లతో తిప్పి కొట్టారు అని సజ్జల రామ కృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పరిషత్ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం అని కొనియాడారు. కుప్పంలోనే టిడిపి బోర్లా పడింది అని ఎద్దేవా చేశారు. కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించ లేదని అన్నారు. పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి అని సూచించారు.  ప్రభుత్వంపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని సజ్జ‌ల  మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments