Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా 40 యేళ్ల సంబరాలు కాదు.. 27 యేళ్ల సంబరాలు...

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:17 IST)
తెలుగుదేశం పార్టీ 40 యేళ్ళ ఆవిర్భావ వేడుకలు మంగళవారం జరుపుకుంటుంది. ఈ వేడుకలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ 40 యేళ్ల సంబరాలు కాదని 27 యేళ్ల సంబరాలు అంటూ వ్యాఖ్యానించారు. పైగా, దానికి వివరణ కూడా ఇచ్చారు. 
 
"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్యపరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చన్నారు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారని గుర్తుచేశారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించి చేయదలచుకుంటే ఇక్కడ నుంచే చూడాలని కోరారు. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలని, ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 యేళ్లలో జరిగిందే.. ఇదే మా పార్టీ ఉద్దేశం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments