Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:03 IST)
అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని చెప్పకుండా జగన్ సన్నిహితుడు వచ్చేస్తున్నాడు.. ఇక వైసిపి పని అయిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసిపి నేతల్లో గుబులు తెప్పిస్తోంది. 
 
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ కూడా. గత కొన్నిరోజులుగా వైసిపి నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. అందుకే ఆయన టిడిపిలోకి వచ్చేస్తున్నారని మంత్రి స్వయంగా ప్రకటన చేశారు. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి టిడిపిలో వెళ్ళినా ఏ పదవులు రావు. 
 
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం లేదు. ఊరికే పార్టీలో నేతగా ఉండాలి తప్ప శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి మాత్రం కొట్టిపారేస్తున్నారు. కావాలనే అధికార పార్టీ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments