Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:03 IST)
అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని చెప్పకుండా జగన్ సన్నిహితుడు వచ్చేస్తున్నాడు.. ఇక వైసిపి పని అయిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసిపి నేతల్లో గుబులు తెప్పిస్తోంది. 
 
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ కూడా. గత కొన్నిరోజులుగా వైసిపి నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. అందుకే ఆయన టిడిపిలోకి వచ్చేస్తున్నారని మంత్రి స్వయంగా ప్రకటన చేశారు. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి టిడిపిలో వెళ్ళినా ఏ పదవులు రావు. 
 
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం లేదు. ఊరికే పార్టీలో నేతగా ఉండాలి తప్ప శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి మాత్రం కొట్టిపారేస్తున్నారు. కావాలనే అధికార పార్టీ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments