'సిద్ధం' సభకు ప్రజల సొమ్ము రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం జగన్ : వైఎస్ షర్మిల

ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (17:20 IST)
'సిద్ధం' సభల పేరుతో ఏపీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుందని, ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్ల మేరకు వెచ్చిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 'సిద్ధం' సభల పేరుతో ప్రభుత్వం ఏకంగా రూ.600 కోట్ల మేరకు ఖర్చు చేసిందన్నారు. ఒక్కో సభకు రూ.90 కోట్ల మేరకు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. 'సిద్ధం' సభల పేరిట ప్రభుత్వ ఆదాయాన్ని వైకాపా దోచుకుంటుందని మండిపడ్డారు. ఇదంతా ఎవరి సొమ్ము అని ఆమె ప్రశ్నించారు. 
 
తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గంపై అంతర్గతంగా చర్చ జరిగిందన్నారు. అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 
 
అలాగే, గత ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ వాగ్ధానం ఏమైందన్నారు. ఈ ఉద్యోగాల భర్తీపై తాము నిలదీస్తే భయపెడుతున్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారని ఆమె నిలదీశారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారంటూ వంగ్యాస్త్రాలు సందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments