Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం

తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (14:18 IST)
హుదూద్ తుపాను విలయతాండంతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఆ నష్టంలో 80 శాతం విశాఖ నగరంలోనే జరిగిందని తెలిపారు.
 
విశాఖపట్నంలో బుధవారం అజయ్ జైన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వగలమన్నారు. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరాకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. విశాఖ ఒక్క నగరంలోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్లకు కరెంట్ ఇస్తామని తెలిపారు.
 
గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. విశాఖ జిల్లాలో పలు 130 కేవీ సబ్ స్టేషన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కవారిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించ గలిగామని అజయ్ జైన్ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments