Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారు: రోజా ఫైర్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (15:48 IST)
కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తొలుత కోడలు బ్రాహ్మణిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరయ్యే పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పంపారని.. వైకాపా నేత రోజా అన్నారు. తర్వాత చంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా డైరెక్టుగా రాహుల్‌తో చేతులు కలిపారన్నారు. 
 
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చూసి ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
 
నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ వ్యవహారంపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివాజీ చెప్పినవి చెప్పినట్లు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సీఎంపై దాడి జరుగుతుందని కూడా శివాజీ చెప్పాడన్నారు. అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దున్నపోతు నుంచి పాలు పితుకుతున్నారా? అని ప్రశ్నించారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుని ఆపరేషన్ గరుడపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments