Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులను రంపానపెట్టింది.. చంద్రబాబే.. పవన్ న్యూట్రల్‌గా వున్నారు: రోజా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లను కాకినాడ నగర పాలక ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజా ఏకిపారేశారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, ఆయన కుమారుడు ల

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (19:02 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లను కాకినాడ నగర పాలక ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజా ఏకిపారేశారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ముందుంటారని రోజా విమర్శించారు.
 
 రాష్ట్రంలో అత్యధిక కాలం పదమూడేళ్లు అధికారంలో ఉండి ఈ కాపులను రాచి రంపానపెట్టింది, నాశనం చేసింది ఎవరంటే చంద్రబాబునాయుడే. కాపులను అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డిగారేనని రోజా గుర్తు చేశారు. అందుకే, వైఎస్ బతికున్నంత కాలం ఆయనకు కాపులు తోడుగా ఉన్నారని రోజా చెప్పుకొచ్చారు
 
కాకినాడలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీకి కాపులు ఓటు వెయ్యరు. పవన్ కల్యాణ్ గారు న్యూట్రల్‌‌గా ఉన్నారు. కాపులందరికీ తానే న్యాయం చేసినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. 
 
ప్రతి ఏటా కార్పొరేషన్ బడ్జెట్‌లో కాపులకు వెయ్యికోట్లు కేటాయించామని చంద్రబాబు చెబుతున్నారు. అవన్నీ అసత్యాలేనని.. నాలుగు బడ్జెట్‌లలో నాలుగు వేల కోట్లు ఇచ్చి వున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments