Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టి పప్పు, ఏంటి రెచ్చిపోతున్నావ్? లోకేష్ పైన రోజా సంచలన వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (23:34 IST)
తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ పైన తనదైన శైలిలో స్పందిస్తూ తీవ్రవిమర్సలు చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. అధికార-ప్రతిపక్షపార్టీల మధ్య గత రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్సలు, ప్రతివిమర్సలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
 
నిన్న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు టిడిపి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బంద్ జరగనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి బంద్ ప్రభావం ఏమాత్రం లేదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఐతే టిడిపి అధినేత చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అంటూ వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు.
 
తన సొంత నియోజకవర్గం పుత్తూరులోని పున్నమి సర్కిల్లో ఉన్న వైఎస్ ఆర్ విగ్రహం వద్ద రోజా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పైన తీవ్రవ్యాఖ్యలు చేశారు. చిట్టి పప్పు అంటూ సంబోధించారు. ఏమీ తెలియని లోకేష్ కూడా విమర్సలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 
అన్నీ తప్పులు మాట్లాడుతూ ఒక సబ్జెక్టుపై కనీస అవగాహన లేని వ్యక్తి లోకేష్ అంటూ మండిపడ్డారు. అలాగే చంద్రబాబుపైనా విమర్సలు చేశారు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని.. పార్టీకే సరిగ్గా న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు రోజా. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments