Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భార్యతో చూసి మాట్లాడివస్తానని వెళ్లి.. తిరిగినరాని లోకాలకు...

చిత్తూరు జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది. కాబోయే భార్యను చూసి ఓసారి మాట్లాడివస్తానని వెళ్లిన వరుడు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాద ఘటన వివరాలను పరిశీలిస్తే....

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (13:30 IST)
చిత్తూరు జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది. కాబోయే భార్యను చూసి ఓసారి మాట్లాడివస్తానని వెళ్లిన వరుడు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాద ఘటన వివరాలను పరిశీలిస్తే.... 
 
రాయచోటి సమీపంలోని సుండుపల్లె మండలం పొలిమేరపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన గురిగింజకుంట సుబ్బానాయుడి కుమారుడు శివకుమార్‌నాయుడు(20)కి మదనపల్లెలోని తన అమ్మమ్మ మనవరాలు శిరీషతో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో కాబోయే భార్యతో మాట్లాడి వస్తానని తన తల్లి రవణమ్మతో చెప్పి ఇంటి నుంచి మోటార్‌ సైకిల్‌పై మదనపల్లెకు బయల్దేరాడు.
 
మార్గమధ్యంలోని గుర్రంకొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ శివకుమార్‌‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలంలోని మొబైల్ ఫోన్ ఆధారంగా బాధితుని కుటుంబ సభ్యులకు, గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 108 సాయంతో హుటా హుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments