Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటి ముంజలు కొందామనుకున్నారు.. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన కారు..?

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (21:55 IST)
తాటి ముంజలు కొందామనుకున్నారు.. ఇంతలో ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన కళ్లముందే భర్త, బిడ్డలు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోవడం చూసి ఆమె తల్లడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ తన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుందని తలచి రోదించింది. చివరికి ఆమె కూడా తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. 
 
ఈ ఘటన విశాఖ-అరకు రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్‌.కోటలో ఉంటున్నారు.
 
ఆదివారం భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళ్తూ మార్గమధ్యంలో తాటిముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఆ సమయంలో అరకు నుండి కాకినాడకు వెళుతున్న ఓ కారు.. అదుపు తప్పి.. రోడ్డు పక్క్రనే బండి ఆపిన సోనాపతి ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొంది. 
 
ఈ ఘటనలో టూవీలర్‌పై కూర్చుని వున్న సోనాపతి చిన్నారులు శ్రావణ్‌(7), సుహాస్‌(4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాపతి(38)ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. 
 
ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments