Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - బాబులు తెలుగును ఉద్ధరిస్తారా? రోజా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు వచ్చే యేడాది నుంచి ఇంగ్లీషు మీడియం చదువులను ప్రారంభించనుంది. ఈ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తెదేపా నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు.
 
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చుగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 'తెలుగు'ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే 'తెలుగు చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచమంతా ఇంగ్లీషు చుట్టూనే తిరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments