Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - బాబులు తెలుగును ఉద్ధరిస్తారా? రోజా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు వచ్చే యేడాది నుంచి ఇంగ్లీషు మీడియం చదువులను ప్రారంభించనుంది. ఈ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తెదేపా నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు.
 
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చుగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 'తెలుగు'ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే 'తెలుగు చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచమంతా ఇంగ్లీషు చుట్టూనే తిరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments