ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్ సర్వీసుల పునరుద్ధరణ

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (08:18 IST)
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులు ప్రారంభమయ్యాయి. కృష్ణా రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 15 బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు.

గతంలో కృష్ణా రీజియన్‌లో 264 బస్సులు నడిచేవి. అయితే ఇప్పుడు 166 బస్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య 1060 బస్సులు సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం ఆ సంఖ్యను కుదించారు.

600 వందల బస్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో తెలంగాణ సుమారు 2 లక్షల 61 వేల కిలోమీటర్లు బస్సులు తీరిగేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది. అయితే రెండు రాష్ట్రాలు సరిసమానంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఏడు నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments