Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రూ.400 కోట్లు

భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (13:07 IST)
భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌బిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఎపీకి 2,500 కోట్లు మిగిలినది తెలంగాణకు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త జీతాలు పడినా బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బ్యాక్సుల్లో వచ్చిన డబ్బును భారీ భద్రత మధ్య తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. 19 బ్యాక్సులలో 400 కోట్ల రూపాయలను ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలోని బ్యాంకులకు తరలించారు. 
 
ఆర్‌బిఐ పంపిన నగదులో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవకాశం ఇక ఉండదని, ఆర్ బిఐ పంపిన నోట్లలో కొత్త 500రూపాయల నోట్లు కూడా ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments