Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఇదే ఆఖరి పోరాటం : రాయపాటి

రాయపాటి సాంబశివరావు. రాష్ట్రంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ప్రస్తుతం నర్సారావుపేట ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన చిరకాల కోరిక.. శ్రీవారికి సేవ చేయాలన్నది.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (16:47 IST)
రాయపాటి సాంబశివరావు. రాష్ట్రంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ప్రస్తుతం నర్సారావుపేట ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన చిరకాల కోరిక.. శ్రీవారికి సేవ చేయాలన్నది. అదే తిరుమల తిరపతి దేవస్థానం ఛైర్మన్‌గా పని చేయాలన్నది. ఇందుకోసం గత 15 యేళ్లుగా కృషి చేస్తున్నారు. కానీ, తితిదే ఛైర్మన్ గిరి అన్నది ఆయనకు అందని ద్రాక్షలా మారింది. 
 
తన చిరకాల వాంఛ అయిన టీటీడీ ఛైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ పదవి కోసం ఆయన రెండుసార్లు ప్రయత్నించారు. అయితే అప్పట్లో డీకే.ఆదికేశవులు నాయుడు ఒకసారి, కనుమూరి బాపిరాజు మరోసారి ఆ పదవిని సొంతం చేసుకున్నారు. ఇపుడు మరోమారు ఆశపడ్డారు. 
 
ప్రస్తుతం తితిదే పాలక మండలి పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త పాలకమండలిలో తనకు చోటు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇదే అంశంపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిపారు. కానీ, ఆయన నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో తితిదే ఛైర్మన్ గిరిపై తనకున్న కోర్కెను రాయపాటి బహిర్గతం చేశారు. ఈ దఫా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రెండు పదవులు ఉండకూడని పార్టీ భావించే పక్షంలో ఎంపీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చంద్రబాబుకు లేఖ రాశారు. ఆరు సార్లు ఎంపీగా పనిచేశానని... ప్రస్తుతం తనకు ఎంపీ పదవికన్నా టీటీడీ ఛైర్మన్ పదవే ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందేమో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments