Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత?: రావెల ఫైర్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (13:17 IST)
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత? సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం ఎంత? అని రావెల పైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటూ తలసాని చేసిన వ్యాఖ్యలపై రావెల మండిపడ్డారు. 
 
తలసానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని, చంద్రబాబు హయాంలో పదవులను అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తలసాని చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? ఏంటిది? అంటూ ఎద్దేవా చేశారు. తలసానికి చట్టంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అందుకే టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే... టీఆర్ఎస్ మంత్రిగా పదవిని అనుభవిస్తున్నారని చెప్పారు. 
 
అలాగే పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్‌లపై రావెల కిషోర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్, జగన్‌లు కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీయాలనుకున్నారని... చివరకు వారు తీసుకున్న గోతిలో వారే పడే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, వైకాపాల కుట్రలు ఇకపై కొనసాగబోవని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments