Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ పవన్.. వెన్నుపోటు ఖాయం.. బీ కేర్‌ఫుల్ విత్ నాదెండ్ల మనోహర్ : ఆర్జీవీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి, పవన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఉద్దేశించి ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో వర్మ మరోమారు హాట్‌టాపిక్ అయ్యారు. 
 
తనకున్న అంతర్గత సమాచారం మేరకు ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌.. పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో మనోహర్ తండ్రిగారైన నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. అలాగే, నాదెండ్ల మనోహర్ కూడా అలా చేస్తారేమోనని తనకు ఆందోళనగా ఉందని ఆయన చెప్పారు. 
 
ఈ విషయాన్ని పవన్‌కు ఒక అభిమానిగా చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అధినేతకు జాగ్రత్తలు సూచించాలని కోరారు. అయితే, వర్మ చేసిన ఈ కామెంట్స్‌ను పవన్ తేలిగ్గా తీసుకుంటున్నారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాలోని 'వెన్నుపోటు' పాటను శుక్రవారం వర్మ విడుదల చేస్తున్నారు. ఆ పాటకు, సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా… ప్రజల్లో పేరున్న నాయకుడికి వెన్నుపోటు ప్రమాదం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments