Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (12:30 IST)
ప్రముఖ రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌కు రాజమండ్రి కేంద్ర కారాగారంలో పని చేసే సిబ్బంది దాసోహమైనట్టు ప్రచారం సాగుతుంది. ఈ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌ కదలికలు, ఫోన్ సంభాషణలపై ఎలాంటి నిఘా లేదు. దీనికి కారణం జైలు సిబ్బంది బోరుగడ్డకు దాసోహం కావడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో పెట్రేగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలోనే ఆయన సెంట్రల్ జైలు నుంచి పలువురు వైకాపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు, తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి, న్యాయస్థానానికి సమర్పించాడు. ఈ కాన్ఫరెన్స్ కాల్స్ సంభాషణల్లోనే బీజం పడినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. జైలులో ఉండే బోరుగడ్డ అనిల్ కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై ఎలాంటి నిఘా లేకపోవడం, జైలు సిబ్బంది అతినికి దాసోహమవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments