Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

సెల్వి
సోమవారం, 12 మే 2025 (19:07 IST)
తెలుగు ప్రజలకు శుభవార్త. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. వర్షానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిందని పేర్కొంటూ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. 
 
హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, తాండూర్, మెదక్, మేడ్చల్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ప్రారంభమవుతుంది. తిరుపతి- కడపలో వర్షం పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
 
ఇకపోతే.. ఈ ఏడాది మే 27న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతంలో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments