Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌ను చూస్తే భయపడే వారే వివాదం రేపుతున్నారు : ఏకే ఆంటోనీ

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (09:29 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూస్తే భయపడేవారే లేనిపోని వివాదాలు రేపుతున్నారని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అభిప్రాయపడ్డారు.
 
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ సెలవుపై వెళ్లడం పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన రాహుల్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారన్నారు. రాహుల్ మరింత శక్తిమంతంగా, పార్టీని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా శక్తిని సంతరించుకుని వస్తారని ఆయన పేర్కొన్నారు. 
 
రాహుల్ విరామం తీసుకుంటున్నాడే తప్ప పార్టీని వదిలిపోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల నుంచి రాహుల్ తప్పుకుంటాడని ఎవరూ భ్రమపడొద్దని ఆయన సూచించారు. అలాంటి కలలు కనడం మానాలని ఆయన సూచించారు. రాహుల్, సోనియాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments