Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రకు అమరాతి ఒక్కటే రాజధాని : రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:08 IST)
నవ్యాంధ్రకు రాజధాని అమరావతి ఒక్కటేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఆయన ఆలూరు సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం యాత్ర తిరిగి ప్రారంభమై ఆలూరు హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శాగి గ్రామం వరకు కొనసాగనుంది. 
 
రాత్రి రాహుల్ అక్కడే బస చేస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న యాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం, పార్టీ సీనియర్‌ నేత కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర జయప్రదం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు జన సమీకరణ చేపట్టారు.
 
ఈ సందర్భంగా అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వీరిలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు ఉన్నారు. స్థానిక రైతులతో కలిసి నినాదాలు చేస్తూ రాహుల్‌ బస చేసిన శిబిరానికి చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. 
 
అమరావతి రైతుల వినతిపై రాహుల్ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఏకైక రాజధాని కావాలి. అమరావతి రైతుల పోరాటానికి నేను సంఘీభావం తెలుపుతున్నా. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం' అని రాహుల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments