Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (12:50 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా, గురువారం ఉదయం 6.30 గంటలకు ఆయన తన యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన తన పాదయాత్రను నిలిపివేసిన చోటు నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పెద్ద చెరువు, దండు గ్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 
 
ఈ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగగా, దీనికి విశేష స్పందన లభించిన విషయం తెల్సిందే. కాగా, దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. తెలంగాణాలో యాత్ర పూర్తయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు 1500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments