Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగిజావను మళ్ళీ వాయిదావేశారు... కారణం తెలీదు!!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (09:21 IST)
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే నిమిత్తం ప్రవేశపెట్టిన రాగిజావ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వాయిదా వేసింది. తొలుత ఈ నెల రెండో తేదీన ప్రారంభించాలని భావించగా, ఆ తర్వాత ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ఇపుడు మరోమారు 21వ తేదీకి వాయిదావేసింది. అయితే, ఈ పథకం వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
కాగా, విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. నిజానికి ఈ పథకాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వాయిదా వేసింది. ఇపుడు కూడా కారణాలు వెల్లడించకపోయినప్పటికీ రెండోసారి కూడా వాయిదా వేసింది. 
 
అదేసమయంలో ఈ రాగిజావను ఏ విధంగా తయారు చేయాలి, అందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి, రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి తదితర వివరాలను బుధవారం ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments