Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమే: రఘువీరా రెడ్డి

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:12 IST)
ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏముందో తనకు తెలియదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారని, చంద్రబాబు రహస్య పాలనకు ఇది అద్దం పడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమని చంద్రబాబు విసిరిన సవాల్‌కు తాను సిద్ధమన్నారు. ప్లేస్, డేట్, టైమ్ చంద్రబాబే డిసైడ్ చేయాలని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు రాష్ట్రానికి మూడు స్మార్ట్ సిటీలే రావడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు రాష్ట్ర సమస్యలపై  బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించిన ఉండవల్లి, చర్చలో తనకూ అవకాశం కల్పించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉండవల్లి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు నిన్న విపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments