Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణంరాజు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (14:21 IST)
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదన్నారు. తన కోసం వైసీపీ నేతలు పడుతున్న పాట్లను చూస్తుంటే తనకే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు.
 
అయితే ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాజధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌నే డిమాండ్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని వివ‌రించారు. త‌న‌పై అనర్హత వేటు వేయ‌క‌పోయినా తానే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. 
 
రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని… వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంద‌న్న విష‌యాన్ని ఉపఎన్నిక ద్వారా తెలియ‌జేస్తాన‌ని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన త‌ప్పేంటని ఆయన నిల‌దీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments