Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ మెజార్టీ అంశంపై అంచనాలు తప్పేలా ఉన్నాయ్ గురూ : రఘురామకృష్ణంరాజు

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (15:16 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పిఠాపురంలో వచ్చే మెజార్టీ విషయంలో తాను వేసిన అంచనా తప్పేలా ఉందని ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో పోలింగ్ సరళి చూశాక తన అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, కూటమికి మరిన్ని స్థానాలు వస్తాయని తెలిపారు. 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
మెజార్టీల విషయంలోనూ తన అంచనాలు సవరిస్తున్నట్టు చెప్పారు. నెలకిందట పవన్ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళానని, అపుడు ఆయనకు 50 వేల నుంచి 55 వేల మెజార్టీ రావొచ్చని భావించానని చెప్పారు. కానీ ఇపుడు తన అంచనా తప్పేలా ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం నియోజకవర్గంలో 65 వేలకు పైగా మెజార్టీ రావొచ్చన్నారు. కొన్ని బూత్‍‌లలో పవన్‌‍కు అనుకూలంగా 80 శాతం మేరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తుందన్నారు. 
 
అలాగే, కుప్పంలో కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 60 వేల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. చంద్రబాబును ఓడించడానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు ఇచ్చారని, అయినప్పటికీ గెలుపు మాత్రం చంద్రబాబుదేనని జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. 
 
ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్‌సైడ్ అని, కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమని రఘురామ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరిలో అందరూ నెగ్గుతారని వెల్లడించారు. అయితే ఇవన్నీ కరెక్టా, కాదా అనేది జూన్ 4న తెలుస్తుందని పేర్కొన్నారు. తన అంచనాలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్ముతున్నట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments