Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం

Webdunia
బుధవారం, 26 మే 2021 (13:15 IST)
వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే.
 
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి ఆయ‌న డిశ్చార్చ్ అయ్యారు. ఆ త‌ర్వాత వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ఢిల్లీలో ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో ఆయ‌న విడుద‌ల‌కు కావాల్సిన ప్ర‌క్రియ అంతా ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు పూర్తి చేశారు. ర‌ఘురామ కాళ్ల‌నొప్పితో పాటు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments