Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భీమవరంలో ప్రధాని పర్యటన - రఘురామ పేరు లేదంటున్న డీజీపీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:41 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకు వచ్చి అక్కడ నుంచి హెలికాఫ్టరులో భీమవరం చేరుకుంటారు. అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబీకులు, సంబంధీకులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
మరోవైపు, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలోగానీ, వేదికపై ఉండేవారి జాబితాలోగానీ, హెలిపాడ్‌ వద్ద ప్రధానిని ఆహ్వానించేవారి జాబితాలోగానీ నరసాపురం సిట్టింగి వైకాపా రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పేరు లేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
పైగా, ఎంపీ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తమకు తెలియదని వెల్లడించారు. రఘురామ సెల్‌ఫోన్‌ నంబరును పోలీసుశాఖ బ్లాక్‌లిస్టులో పెట్టలేదని వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఫ్లయింగ్‌ జోన్‌కు సంబంధించి ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా వాయుమార్గంలో రావాలంటే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments