Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత!

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:36 IST)
ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూశారు. అవివాహిత అయిన రాగతి చిన్నతనంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డారు. అయినప్పటికీ కార్టూనిస్టుగా రాణించి.. చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆమె కార్టూన్లు గీసేవారు. ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో ఆమె తుదిశ్వాస విడిచారని.. మరణించేనాటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు. 
 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమెను విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందిన రాగతి గురువారం కన్నుమూశారు. 
 
అయితే రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి గుర్తింపు పొందారు. అనేక పత్రికల్లో రాగతి కార్టూన్లు అచ్చయ్యాయి. వ్యంగ్యంగా కార్టూన్లు గీయడంతో రాగతి దిట్ట. దురాచారాల్ని ప్రశ్నిస్తూ.. హాస్యం మేళవిస్తూ కార్టూన్లు గీసిన గీత ఆగిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

Show comments