Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు నేనూ అన్ని మూసుకొని వారి మాట విందాం బ్రదరూ...

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:21 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇదే స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయి ప్రముఖ సినీ నిర్మాత, బడా పారిశ్రామికవేత్త పీవీపీ వరప్రసాద్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరింత ముదిరిపాకానపడింది. దీంతో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ మరోమారు కేశినేని నాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాజాగా ఎంపీ కేశినేని నాని టార్గెట్‌ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన పీవీపీ, 'రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ... ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తింస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నాని' అని అన్నారు. ఈ ట్వీట్‌పై కేశినేని స్పందించాల్సివుంటగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments