Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ రాజుగారు.. మీ కర్తవ్య దీక్షకు సలాం...

విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (09:02 IST)
విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు. అలాంటి రాజు.. పుట్టెడు దుఃఖంలోనూ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ సాగుతున్న పోరాటంలో పాల్గొన్నారు. ఆయన్ను చూసిన మిగిలిన ఎంపీలు మరింత పట్టుదలతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇంతకీ అశోకగజపతి రాజు పుట్టుడు దుఃఖంలో ఎందుకున్నారో కదా మీ సందేహం... 
 
ఇటీవల అశోకగజపతి రాజు తల్లి కుసుమ కన్నుమూశారు. ఆమె విజయనగర సామ్రాజ్య చివరి పట్టపురాణి కూడా. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి స్వస్థలం చేరుకున్నారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలని సీఎం ఆదేశించడంతో అంత్యక్రియలు పూర్తికాగానే అశోక్‌ ఢిల్లీ చేరుకుని... ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం ముందు ధర్నాలో అశోక్‌గజపతిరాజు కూడా పాల్గొనడం చూసి, ఆయన కర్తవ్య దీక్షను చంద్రబాబు మెచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments