Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలించకుండా కుమార్తెల అంత్యక్రియలు చేసిన పురుషోత్తం నాయుడు

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (18:19 IST)
జంట హత్యల కేసులో తండ్రి పురుషోత్తం నాయుడు మొదటి ముద్దాయి. మదనపల్లె పోలీసులు పురుషోత్తం నాయుడును మొదటి ముద్దాయిగా, తల్లి పద్మజను రెండవ ముద్దాయిగా నిర్థారించుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద సెక్షన్ 302 కేసులు పెట్టారు. 
 
అయితే రెండురోజుల క్రితం హత్య జరిగితే ఈరోజు ఉదయం నిందితులను అరెస్టు చేశారు. తల్లిదండ్రుల మానసిక పరిస్థితి బాగాలేదన్న ఉద్దేశంతో పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. నిన్న అంత్యక్రియలకు హాజరైన తల్లిదండ్రుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు.
 
ముఖ్యంగా తండ్రి పురుషోత్తం నాయుడు మొదట్లో ఏడుస్తూ కూతుర్ల దగ్గరకు వెళ్లి అంత్యక్రియలు చేశారు. కానీ ఆ తరువాత మాత్రం తండ్రిలో ఏ మాత్రం బాధ కనిపించలేదు. ఈరోజు ఉదయం ఇద్దరికీ కోవిడ్ టెస్టులకు తీసుకెళ్ళేటప్పుడు కనీసం బాధపడుతున్నట్లు ఫేస్ కూడా లేదు. 
 
తల్లి పద్మజ ఏమో వింతగా ప్రవర్తిస్తే.. తండ్రి పురుషోత్తం నాయుడు మాత్రం ఏదో కాలేజీకి వెళుతున్నట్లుగా వెళ్ళి పోలీసు  జీపులో కూర్చున్నాడు. వీరిద్దరి ప్రవర్తన చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పిల్లలను తమ చేతులతో తామే చంపేశామన్న బాధ వారిలో ఏ మాత్రం కనిపించలేదు. ఉన్నత చదువులు చదువుకున్న ఇద్దరు ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments