పుంగనూరు అల్లర్లు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదనీ...

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. వీరిలో కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరికొందరికి ఇంకా బెయిల్ రాలేదు. దీంతో తన కుమారుడికి బెయిల్ రాలేదన్న మనస్తాపంతో ఓ నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచి శ్రీనివాసులు నాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకా ఉన్నారు. ఈ కేసులోని నిందితుల్లో 50 మందికి బెయిల్ వచ్చింది. కానీ, శ్రీనివాసులు నాయుడికి మాత్రం బెయిల్ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికు గురైన అతని తల్లి రాజమ్మ తెలియని ద్రావకం ఏదో తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments