Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో ఫ్యాన్, స్టాండులో సైకిల్, క్యాంటీన్‌లో గ్లాసు : పృథ్వీ జోస్యం

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (13:36 IST)
ఈనెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఘన విజయం సాధించనుందని సినీ హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అలాంటి నేతలకు శాశ్వత విశ్రాంతి కల్పించాలని పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
 
అదేసమయంలో నరసాపురంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. జనసేన నేత నేతలు నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరన్నారు. 
 
వైఎస్‌ జగన్‌ ఏపీలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బాబు సీఎంగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. మే 23వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీలో ఫ్యాన్, స్టాండులో సైకిల్, క్యాంటీన్‌లో గాజు గ్లాసులు ఉంటాయని పృథ్వీ జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments