Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో సినిమా వారికి నిరసన

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:25 IST)
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి వచ్చిన సినీ ప్రముఖులకు రాజధాని రైతుల సెగ తగిలింది. మంగళవారం హైదరాబాద్‌ నుండి సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.సురేష్‌బాబు తదితరులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుండి ఉండవల్లిలోని మాజీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్‌ హౌస్‌కు వచ్చారు. ఇది తెలుసుకున్న రాజధాని రైతులు వారు బస చేసిన గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు చేరుకున్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలపాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను పంపించి వేశారు. అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు మంగళవారానికి 175వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారి పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో పొలిటికల్‌, నాన్‌ పొలిటికల్‌ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతుల న్యాయమైన పోరాటానికి జెఎసి అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments