Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌లో వ్యభిచారం : సండే పార్టీ పేరుతో ఓ యువతి.. ఐదుగురు విటుల ఎంజాయ్

కరీంనగర్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. సండే పార్టీ పేరుతో ఒక యువతి, ఐదుగురు విటులు ఎంజాయ్ చేస్తుండగా, ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. వారందరినీ అదుపుల

Webdunia
సోమవారం, 24 జులై 2017 (11:38 IST)
కరీంనగర్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. సండే పార్టీ పేరుతో ఒక యువతి, ఐదుగురు విటులు ఎంజాయ్ చేస్తుండగా, ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్‌ ప్రాంతంలో నెల్లుట్ల వనిత కొన్ని నెలలుగా కృష్ణనగర్‌ ప్రాంతంలో తన ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి యువకులను, చదువుకునే విద్యార్థులను కరీంనగర్‌కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చింది. 
 
ఆదివారం కూడా కొందరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తుందనే సమాచారం మేరకు ఆ గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా కాకినాడకు చెందిన ఒక యువతితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 34 వేల రూపాయలు, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments