సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం: మంత్రి ఆదిమూల‌పు సురేష్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:21 IST)
సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మంగళవారం నాడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని.. ఎంసెట్‌లో సుమారు 2,72,720 మంది నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం. ప్రతి సెంటర్‌లో ఇసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.

విద్యార్థులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం. హాల్ టికెట్‌తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నాం’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా ముఖంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments