Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుటుంబ సభ్యులే 22 మంది.. నాకొచ్చిన ఓట్లు నాలుగు : కేఏ పాల్

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (14:12 IST)
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తన కుటుంబంలో 22 మంది సభ్యులు ఉన్నారని, కానీ తనకు పోలైన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. విశాఖలో తొలి నుంచీ తానే ఆధిక్యంలో ఉన్నానని అధికారులు కూడా తనకు చెప్పారని గుర్తు చేశారు. అయితే, అనేక బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రీపోలింగ్ జరపాలని కోర్టుకెళ్లానని ఆయన తెలిపారు. మురళీ నగర్‌లోని పోలింగ్ బూత్ 235లో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు తనకు ఓటు వేస్తే అక్కడ తనకు వచ్చిన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని గుర్తు చేశారు. 
 
రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అప్పట్లో నరేంద్ర మోడీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ఈసారి సీసీటీవీ లింకులను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులో చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని కేఏ పాల్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments