Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుటుంబ సభ్యులే 22 మంది.. నాకొచ్చిన ఓట్లు నాలుగు : కేఏ పాల్

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (14:12 IST)
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తన కుటుంబంలో 22 మంది సభ్యులు ఉన్నారని, కానీ తనకు పోలైన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. విశాఖలో తొలి నుంచీ తానే ఆధిక్యంలో ఉన్నానని అధికారులు కూడా తనకు చెప్పారని గుర్తు చేశారు. అయితే, అనేక బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రీపోలింగ్ జరపాలని కోర్టుకెళ్లానని ఆయన తెలిపారు. మురళీ నగర్‌లోని పోలింగ్ బూత్ 235లో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు తనకు ఓటు వేస్తే అక్కడ తనకు వచ్చిన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని గుర్తు చేశారు. 
 
రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అప్పట్లో నరేంద్ర మోడీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ఈసారి సీసీటీవీ లింకులను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులో చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని కేఏ పాల్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments