Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న విజయవాడలో 'ప్రజా పాదయత్ర'

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:41 IST)
అమరావతి రాజధానిగా ప్రకటించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ, రైతు ఐకాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 15 (మంగళవారం) విజయవాడలో తల పెట్టిన “అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్ర"ని జయప్రదం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్లు ఏ. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు పిలుపునిచ్చారు.

విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి జెఏసి రాష్ట్ర కార్యాలయంలో అమరావతి పరిరక్షణ సమితి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, దళిత, బహుజన, పౌర సంఘాలు, కార్మిక, కర్షక, వర్తక సంఘాల నాయకులు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా శివారెడి మట్లాడుతూ రాజధానికి భూమిలిచ్చిన రైతులకు, రైతు కూలీల కుటుంబాలకు అండగా జెఏసీ ఉందని, అమరావతి రైతన్నలకు మద్దతుగా 5 కోట్ల ఆంధ్రుల రాజధానికై “ప్రజా ర్యాలీ ని జయప్రదం చేయాలని కోరారు.

వైసిపి మినహా అన్ని రాజకీయ పక్షాలు పాల్గొంటున్నాయని, అమరావతినే రాజధానిగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అమరావతిని సాధించుకునేంత వరకు మా పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
 
కోకన్వీనర్ గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ అమరావతి కోసం ఏడాది నుండి ఉద్యమం సాగుతుందని, రాజధానిని సాధించుకునే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఉ ద్యమంలో భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాపితంగా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని, ఈ నెల 17న ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయని పాలెంలో “బహిరంగ సభలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బేజషాలు వదిలి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు.
 
సమావేశంలో సుంకర పద్మశ్రీ, గద్దె అనూరాధ, పి.దుర్గాభవానీ, చెన్నుపాటి ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జెఏసీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments