Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు భక్తి వ్యభిచారులు.. ప్రభోదానందస్వామి

పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలి

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (12:13 IST)
పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువమంది దేవుళ్ళను ఆరాధించేవారు భక్తి వ్యభిచారులని ప్రబోధానంద స్వామి అన్నారు.


తమ ఆశ్రమంపై పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభోదానంద ఖండించారు. అదే విధంగా చిన్నపొలమడలో జరిగిన హింసాత్మక సంఘటనపై స్పందించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చిన పొలమడ వద్ద ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన హింసాత్మక సంఘటలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రభోదానందపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా మరొకొందరు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు చేశారు.

తన కేసు విషయాన్ని కోర్టులే తేలుస్తాయని అన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం జరిగిన రోజున హింసాత్మక సంఘటనలు జరగడం ఆ ఘటనలో కొందరు చనిపోవడానికి కారణం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డేనని ప్రభోదానంద ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments