Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారికంగా విద్యుత్ కోతలు రావొచ్చు...క‌రెంటు పొదుపు చేయండి

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (17:27 IST)
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విద్యుత్ అంశంపై స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. డబ్బు ఖర్చు చేసినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. విద్యుత్ అంశంపై కేంద్రమంత్రి చెప్పింది అవాస్తవం అని సజ్జల అన్నారు. సీఎం ఇప్పటికే ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు.
 
 భవిష్యత్తులో అధికారికంగా కోతలు రావొచ్చని వివరించారు. ఇళ్లలో విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కూడా సజ్జల వివరణ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని అన్నారు. అఫిడవిట్లు వేయించడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. లబ్దిదారులకు తెలియకుండానే కేసులు పెడుతున్నారని వివరించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళతామని వెల్లడించారు. డివిజన్ బెంచ్ లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments