తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని, ఆయన ఇష్టమొచ్చినట్టుగా పాలన చేయడానికి, నడుచుకోవడానికి అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన బుధవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు.
ఇలా చేయడానికి కేసీఆర్దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని పొన్నం నిలదీశారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, ప్రాజెక్టులపై అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం.. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి.. తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరు కాదన్నారు.