Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో ఓటేసిన పవన్ దంపతులు.. వైసీపీ బ్యాచ్‌కు ఝలక్

సెల్వి
సోమవారం, 13 మే 2024 (11:19 IST)
Pawan_Anna
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్‌కు వెళ్లారు. పోలింగ్ బూత్‌కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. 
 
సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. దీంతో అభిమానులను కట్టడి చేసేందుకు సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
పోలింగ్ కేంద్రానికి భార్యతో పవన్ రావడం వైసీపీ నేతల విమర్శలకు కళ్లెం వేసేలా చేసింది. గతంలో పవన్, అన్నా సామాజికంగా విడాకులు తీసుకున్నారని, ఇకపై సత్సంబంధాలు లేవని వైసీపీ మీడియా సంస్థలు, మద్దతుదారులు ప్రచారం చేసేవారు. 
 
పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, భార్యలను కార్ల మాదిరిగా మారుస్తాడని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వాస్తవానికి పవన్ తన భార్య అన్నతో కలిసి మంగళగిరిలో ఓటు వేయడానికి రావడం వైసీపీ నేతలకు షాకిచ్చేలా చేసింది. తద్వారా పవన్ ఇలా వైసీపీ బ్యాచ్‌కి గట్టి ఝలక్ ఇచ్చినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments