Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో ఓటేసిన పవన్ దంపతులు.. వైసీపీ బ్యాచ్‌కు ఝలక్

సెల్వి
సోమవారం, 13 మే 2024 (11:19 IST)
Pawan_Anna
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్‌కు వెళ్లారు. పోలింగ్ బూత్‌కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. 
 
సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. దీంతో అభిమానులను కట్టడి చేసేందుకు సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
పోలింగ్ కేంద్రానికి భార్యతో పవన్ రావడం వైసీపీ నేతల విమర్శలకు కళ్లెం వేసేలా చేసింది. గతంలో పవన్, అన్నా సామాజికంగా విడాకులు తీసుకున్నారని, ఇకపై సత్సంబంధాలు లేవని వైసీపీ మీడియా సంస్థలు, మద్దతుదారులు ప్రచారం చేసేవారు. 
 
పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, భార్యలను కార్ల మాదిరిగా మారుస్తాడని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వాస్తవానికి పవన్ తన భార్య అన్నతో కలిసి మంగళగిరిలో ఓటు వేయడానికి రావడం వైసీపీ నేతలకు షాకిచ్చేలా చేసింది. తద్వారా పవన్ ఇలా వైసీపీ బ్యాచ్‌కి గట్టి ఝలక్ ఇచ్చినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments