Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యను అడ్డుకున్న ఖాకీలు - మా జోలికొస్తే తిరగబడతామంటూ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (14:29 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో బాలయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఇక్కడ మూడు రోజుల క్రితం జాతర జరిగింది. ఆ సమయంలో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. అతన్ని పరామర్శించేందుకు బాలయ్య ఆ గ్రామానికి వచ్చారు. 
 
కానీ, బాలయ్యను ఆ గ్రామానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు దిగివచ్చి మొత్తం కాన్వాయ్‌ను కాకుండా, కేవలం బాలయ్య వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి వెళ్లనిచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, గ్రామాలో పగలు, ప్రతీకారాలు రేపే విధంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోమారు తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments